కథ – స్క్రీన్‌ ప్లే... సుకుమార్‌

13 Mar, 2021 01:58 IST|Sakshi
కార్తికేయ, సుకుమార్‌

దర్శకుడు సుకుమార్‌ నిర్మాతగా మారి, సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌పై కొత్త దర్శకులను ప్రోత్సహిస్తూ సినిమాలు నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్‌పై వచ్చిన తొలి చిత్రం ‘కుమారి 21ఎఫ్‌’ ఘనవిజయం సాధించింది. ఇటీవల విడుదలైన ‘ఉప్పెన’ను మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి నిర్మించారు. తాజాగా ‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ హీరోగా ఓ సినిమా నిర్మించనున్నారాయన. ఈ సినిమా నవంబర్‌లో ప్రారంభం కానుంది. ‘‘కార్తికేయ నటించిన తాజా చిత్రం ‘చావు కబురు చల్లగా’ ఈ నెల 19న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ని చూసి, కార్తికేయ నటనకు ముగ్ధుడైన సుకుమార్‌ తన బ్యానర్‌లో ఓ సినిమాను నిర్మించడానికి ప్లాన్‌  చేశారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ ప్లే, సంభాషణలు సుకుమార్‌ అందిస్తున్నారు. దర్శకుడు, ఇతర వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి.

మరిన్ని వార్తలు