టీజర్‌ ఆసక్తిగా ఉంది: సుకుమార్‌

28 Jan, 2021 08:14 IST|Sakshi

‘‘అర్ధశతాబ్దం’ టైటిల్‌ పవర్‌ఫుల్‌గా ఉంది. టీజర్‌ ఆసక్తిగా ఉంది. రవీంద్ర టేకింగ్‌ ఎక్స్‌లెంట్‌గా ఉంది. ఈ సినిమా హిట్‌ అయి నిర్మాతలకు మంచి లాభాలు రావాలి’’ అని డైరెక్టర్‌ సుకుమార్‌ అన్నారు. కార్తీక్‌ రత్నం, కృష్ణ ప్రియ, నవీన్‌ చంద్ర, సాయి కుమార్‌ ప్రధాన పాత్రల్లో రవీంద్ర పుల్లే దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అర్ధశతాబ్దం’. వీర్‌ ధర్మిక్‌ సమర్పణలో చిట్టి కిరణ్‌ రామోజు, తేలు రాధాకృష్ణ నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను సుకుమార్‌ రిలీజ్‌ చేశారు. చిట్టి కిరణ్‌ రామోజు, తేలు రాధాకృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఇటీవల రిలీజ్‌ చేసిన ఫస్ట్‌ లుక్‌కి మంచి స్పందన వచ్చింది. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది. త్వరలోనే చిత్రాన్ని రిలీజ్‌ చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: నౌఫల్‌ రాజా. 

మరిన్ని వార్తలు