చిత్రం సీక్వెల్‌.. మరో ఉదయ్‌కిరణ్‌ దొరికేశాడు

7 Apr, 2021 15:17 IST|Sakshi

‘చిత్రం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు తేజ. తొలి సినిమాతోనే సెన్సేషన్‌ క్రియేట్‌ చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు.  ఈ చిత్రంతో ఉదయ్‌కిరణ్‌, రీమాసేన్‌ హీరో, హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. ఈ మూవీ ఘన విజయంతో ఇద్దరూ స్టార్స్‌గా ఎదిగారు. ఈ చిత్రం అప్పట్లోనే బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచి నిర్మాతలకు కాసులు కురిపించింది. ఇప్పుడు దీనికి  సీక్వెల్ గా `చిత్రం 1.1` సినిమాని రూపొందిస్తున్నారు.

ఈ సినిమాతో తేజ తన కొడుకు అమిత‌వ్ తేజని హీరోగా పరిచయం చేయనున్నాడు. ఇందుకోసం విదేశాల్లో శిక్షణ కూడా ఇప్పించినట్లు సమాచారం. మరి అమితవ్‌ తేజకి  ఈ సినిమా ఎలాంటి టర్న్‌ తీసుకుంటుందో చూడాల్సి ఉంది.  ఈనెల 18న ఈ చిత్రం షూటింగ్‌ పప్రారంభం కానుంది. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల కానుంది. 

చదవండి: నిహారిక పోస్ట్‌పై భర్త షాకింగ్‌ కామెంట్స్‌ !
పుట్టిన రోజు నాడు భోరున ఏడుస్తున్న ఆర్జీవీ!

మరిన్ని వార్తలు