Mahabharat Series: ఓటీటీ చరిత్రలో అతిపెద్ద ప్రాజెక్ట్‌గా ‘మహాభారత్‌’..

10 Sep, 2022 20:37 IST|Sakshi

అల్లు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో ‘మహాభారత్’

మహాభారతం నిజంగా ఒక మహాగ్రంథం. అది చదవడం మొదలు ఎన్నటికీ పూర్తికానంతగా రచన జరిగింది. లెక్కలేనన్ని పాత్రలు, పాత్రధారులు మనకు కనిపిస్తారు. ప్రతి ఒక్క పాత్రకు దానికంటూ ఒక విశిష్టత ఉంటుంది. వేదవ్యాస మహర్షి రచించిన ఈ గ్రంధాన్ని తెరకెక్కించాలని ఎన్నో నిర్మాణ సంస్థలు, దర్శకులు సన్నాహాలు చేశారు. దర్శక ధీరుడు రాజమౌళి డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ కూడా ఇదే. అయితే ఇది సినిమా కంటే ముందు వెబ్‌ సిరీస్‌ రూపంలో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.

డిస్నీ+ హాట్‌స్టార్ ఇండియన్  ఓటీటీ స్పేస్‌లో అతిపెద్ద ప్రాజెక్ట్‌గా ‘మహాభారత్‌’ రాబోతుంది. అల్లు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మాణంలో భాగస్వామ్యం కానుంది. ‘గ్రేటెస్ట్ ఇతిహాసం- మునుపెన్నడూ చూడని స్థాయిలో తిరిగి చెప్పబడుతుంది. ఒక అద్భుతమైన దృశ్యం కోసం చూస్తూ ఉండండి. త్వరలోనే డిస్నీ+ హాట్‌స్టార్‌లో 'మహాభారత్' రాబోతుంది’ అని అడిస్నీ+ హాట్‌స్టార్ సంస్థ ట్వీట్‌ చేసింది. 

అల్లు ఫ్యామిలీ ఇటీవలే అల్లు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ను ప్రారంభించింది. ఇప్పటికే వారు మెగా బడ్జెట్ ప్రాజెక్ట్‌లో భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఈ సిరీస్‌కు  సహ నిర్మాతలుగా కనిపిస్తున్నారు. ఈ మెగా ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు