Virataparvam: విరాటపర్వం ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో అపశ్రుతి

5 Jun, 2022 21:32 IST|Sakshi

సాక్షి, కర్నూలు: విరాటపర్వం ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో అపశృతి చోటు చేసుకుంది. కర్నూలులో ఆదివారం సాయంత్రం డీఎస్‌ఏ మైదానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఒక్కసారిగా వీచిన ఈదురుగాలులకు ఎల్‌ఈడీ స్క్రీన్‌ కూలిపోయింది. దీంతో విరాట పర్వం మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అర్థాంతరంగా ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వేదికకు విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో ఆ ప్రాంతమంతా అంధకారం నెలకొంది. హీరోహీరోయిన్లు రానా, సాయిపల్లవి రాకముందే ఈ ఘటన చోటు చేసుకుంది.

చదవండి: విరాటపర్వం ట్రైలర్‌: నీ రాతలో లేకపోవచ్చు, కానీ తలరాతలో నేనే ఉంటా
హోటల్‌కు తీసుకెళ్లి ముద్దులతో ముంచెత్తాడు, అప్పుడే..

మరిన్ని వార్తలు