Prithvi Ambar: ‘దియా’ మూవీ హీరో ఇంట తీవ్ర విషాదం

16 Jul, 2022 11:14 IST|Sakshi

‘దియా’ ఫేం, కన్నడ యంగ్‌ హీరో పృథ్వీ అంబర్‌ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి సుజాత కన్నుమూశారు. కొంతకాలం హృదయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆరోగ్యం బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ క్రమంలో శుక్రవారం ఆరోగ్యం విషమించడంతో ఆమె తుదిశ్వాస విడిచారు. తల్లి మరణంతో పృథ్వీ ఇంట విషాద చాయలు నెలకొన్నాయి. ఆమె మృతిపట్ల కన్నడ టీవీ, సినీ నటీనటులు సంతాపం తెలుపుతు పృథ్వీ కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు.

చదవండి: పూరీ దంపతుల విడాకులపై అంబర్‌ పేట్‌ శంకరన్న క్లారిటీ!

కాగా పృథ్వీ పలు టీవీ సీరియల్స్‌లో నటించి గుర్తింపు పొందాడు. 2008 ‘రాథా కల్యాణ’ సీరియల్‌తో నటుడిగా పరిచమైన పృథ్వీ ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ హీరో అయ్యాడు. 2014లో వచ్చిన ‘బరికే’ అనే తుళు సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చిన పృథ్వీ 2020లో వచ్చిన ‘దియా’ సినిమాతో హీరో అయ్యారు. ఈ సినిమా తెలుగులోనూ ‘దియా’ పేరుతో రిలీజై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. హీరోగా పృధ్వీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. 

చదవండి: లలిత్‌ మోదీ కంటే ముందు 9 మందితో సుష్మితా డేటింగ్‌, వారెవరంటే!

మరిన్ని వార్తలు