Dosthan Movie: డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకొస్తున్న 'దోస్తాన్' 

28 Nov, 2022 17:20 IST|Sakshi

శ్రీ సూర్య మూవీస్ క్రియేషన్స్ పతాకంపై సిద్ స్వరూప్ , కార్తికేయ , ఇందు ప్రియ, ప్రియ వల్లభి నటీనటులుగా తెరకెక్కిన చిత్రం 'దోస్తాన్'. సూర్య నారాయణ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు. ప్రస్తుతం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని  డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ త్వరలోనే నిర్వహిస్తామని చిత్రబృందం తెలిపింది. 

చిత్ర దర్శక, నిర్మాత సూర్యనారాయణ మాట్లాడుతూ.. 'సిద్ స్వరూప్ అందించిన కథ నచ్చడంతో ఈ సినిమా చేశా. అన్ని వర్గాల  వారికి  నచ్చే విధంగా  తెరకెక్కించాం. ఇందులో ఫ్యామిలీ ఎమోషన్, లవ్, ఫ్రెండ్‌షిప్ మూడు జోనర్స్ కలిసిన మూవీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. ఇంతకుముందు హరీష్ రావు విడుదల చేసిన సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇప్పుడు ఈ సినిమా  ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా త్వరలో చేయబోతున్నాం. డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం.  "దోస్తాన్" సినిమాను ఆదరించి ఆశీర్వదించాలని  మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు. 

మరిన్ని వార్తలు