దసరాకే ‘దృశ్యం 2’, విడుదల తేదీ ఎప్పుడంటే..

14 Sep, 2021 08:51 IST|Sakshi

ఇటీవల విడుదలైన మలయాళం సూపర్‌ హిట్‌ మూవీ ‘దృశ్యం 2’ అదే పేరుతో తెలుగులో రీమేక్‌ అయిన విషయం తెలిసిందే. మలయాళంలో మోహన్‌ లాల్‌, మీనా ప్రధాన పాత్రలో నటించగా, తెలుగులో వెంటటేశ్, మీనా లీడ్‌ రోల్‌లో కనింపిచనున్నారు. జీతూ జోసెఫ్‌ దర్శకత్వంతో డి. సురేష్‌ బాబు నిర్మించిన ఈ చిత్రం ఓటీటీలో విడుదల అవుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 

అయితే ఈ తాజా సమాచారం ప్రకారం దృశ్యం 2ను మేకర్స్‌ ఓటీటీలో కాకుండా థియేటర్లో విడుదల చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓటీటీ డిల్‌ను కూడా క్యాన్సిల్‌ చేసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా ‘దృశ్యం 2’ను దసరా సందర్భంగా అక్టోబర్‌ 13న రిలీజ్‌ను డేట్‌ మేకర్స్‌ ఫిక్స్‌ చేశారట.

మరిన్ని వార్తలు