జోడీ రిపీట్‌?

27 Aug, 2022 04:34 IST|Sakshi

దుల్కర్‌ సల్మాన్, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామం’కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. అలా ఈ చిత్రంతో బాలీవుడ్‌ హీరోయిన్‌ మృణాల్‌ ఠాకూర్‌కు తెలుగులో మంచి అరంగేట్రం లభించింది. ‘సీతారామం’ను నిర్మించిన వైజయంతీ మూవీస్‌లోనే మృణాల్‌ మరో సినిమా సైన్‌ చేశారట. ఈ సినిమాను  తెరకెక్కించే దర్శకుల్లో హను రాఘవపూడి, నందినీ రెడ్డి పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే  హీరో పాత్రకు దుల్కర్‌ సల్మాన్‌ పేరు పరిశీలనలో ఉందట. ఒకవేళ ఈ సినిమాలో హీరోగా దుల్కర్‌ సల్మాన్‌ ఫిక్స్‌ అయితే ‘సీతారామం’ జోడీ రిపీటైనట్లే. మరి.. దుల్కర్, మృణాల్‌ మళ్లీ జోడీ కడతారా? వేచి చూడాల్సిందే.

మరిన్ని వార్తలు