థ్రిల్‌ చేస్తారట

19 Jan, 2021 06:11 IST|Sakshi

‘చీనీకమ్, పా, షమితాబ్, కీ అండ్‌ కా, ప్యాడ్‌మ్యాన్‌’ వంటి సినిమాల తర్వాత ఓ థ్రిల్లర్‌ కథను చెప్పడానికి రెడీ అయ్యారట బాలీవుడ్‌ దర్శకుడు ఆర్‌. బాల్కీ. ఈ సినిమాలో మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించనున్నారు. ఇదో ప్యాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ అని తెలిసింది. ఇప్పటివరకూ బాల్కీ తీసిన సినిమాల కంటే వైవిధ్యంగా ఈ సినిమా ఉంటుందట. ఈ సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లర్‌ను ఏడాది చివర్లో సెట్స్‌ మీదకు తీసుకెళ్లనున్నారట. ఒకే షెడ్యూల్‌లో సినిమా చిత్రీకరణ మొత్తాన్ని పూర్తి చేయాలనే ఆలోచనలో చిత్రబృందం ఉందట. 2018లో వచ్చిన ‘కార్వాన్‌’తో హిందీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు దుల్కర్‌. ఆ తర్వాత ‘జోయా ఫ్యాక్టర్‌’ అనే సినిమా కూడా చేశారు.

మరిన్ని వార్తలు