బూసాన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు హారామీ

15 Sep, 2020 03:15 IST|Sakshi
ఇమ్రాన్‌ హష్మి

ఇమ్రాన్‌ హష్మి నటించిన లేటెస్ట్‌ హిందీ చిత్రం ‘హారామీ’కు అంతర్జాతీయ గౌరవం దక్కింది. ఈ ఏడాది జరగనున్న బూసాన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘హారామీ’ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఇండో – అమెరికన్‌ చిత్రంగా తెరకెక్కిన ఈ చిత్రానికి శ్యామ్‌ మదిరాజ్‌ దర్శకత్వం వహించారు. ముంబై వీధుల్లో జరిగే క్రైమ్‌ కథా చిత్రమిది. రెండేళ్ల పాటు ఈ సినిమాను చిత్రీకరించారు. ‘మా టీమ్‌ అందరి శ్రమ వల్ల బూసాన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కి మా సినిమా ఎంపికైందని అనుకుంటున్నాను. ఇండియన్‌ ఆడియన్స్‌కు ఈ సినిమా ఎప్పుడు చూపిస్తానా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు ఇమ్రాన్‌ హష్మి. అక్టోబర్‌ 21 నుంచి 30 వరకూ బూసాన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ జరగనుంది.

మరిన్ని వార్తలు