Evaru Meelo Koteeswarulu: బ్రెయిన్‌ హీటెక్కుతుంది: రామ్‌చరణ్‌

15 Aug, 2021 19:44 IST|Sakshi

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా ‘ఎవరు మీలో కోటీశ్వరులు(EMK)’ఓ రియాల్టీ షో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  జెమినీ టీవీలో ఈ నెల 22 నుంచి ప్రసారం కానుంది. కాగా, ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టే తొలి ఎపిసోడ్‌కు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ గెస్ట్ గా విచ్చేసి సందడి చేయనున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ జెమిని టీవీ తాజాగా ఓ ప్రోమో విడుదల చేసింది.

తారక్‌, చెర్రీ ఓ రేంజ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించినట్లు ప్రోమో చూస్తే అర్థమవుతుంది. ‘సీటూ హీటెక్కుతుంది.. బ్రెయినూ హీటెక్కుతుంది’ అంటూ చరణ్ టెన్షన్ పడడం, తారక్ అతనితో కలిసి సందడి చెయ్యడంతో ప్రోమో చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ప్రతి సోమవారం నుంచి బుధవారం వరకు సాయంత్రం రాత్రి 8:30 గంటలకు ఈ షో టెలికాస్ట్‌ కానుంది.  'ఎవరు మీలో కోటీశ్వరులు' ప్రారంభ ఎపిసోడ్ (కర్టెన్ రైజర్)కు ముఖ్య అతిథి తన సోదరుడు రామ్ చరణ్  వచ్చాడని,  దీనికి సంబంధించిన షూటింగ్ జరిగిందని, ప్రేక్షకులకు ఎంతో వినోదం లభిస్తుందని ఎన్టీఆర్‌ ట్వీట్‌ చేశాడు. 

మరిన్ని వార్తలు