శ్రీవారిని దర్శించుకున్న దిల్‌రాజు దంపతులు

13 Oct, 2020 08:13 IST|Sakshi

సాక్షి, తిరుపతి: ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య తేజస్వినితో కలిసి తిరుపతి వచ్చిన దిల్‌ రాజు నేటి ఉదయం వీఐపీ దర్శనంలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయన సతీమణికి తీర్థప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించారు. ఈ నేపథ్యంలో దిల్‌ రాజు మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారు. దిల్‌ రాజు దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఇది రెండో సారి. మేలో తేజస్వినితో వివాహం అనంతరం దిల్‌ రాజు శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. (చదవండి: దిల్ రాజు కీల‌క నిర్ణ‌యం)


 

మరిన్ని వార్తలు