టాలీవుడ్‌లో మరో​ విషాదం.. నిర్మాత మృతి

29 Sep, 2022 09:07 IST|Sakshi

కొల్లిపర(గుంటూరు జిల్లా): కొల్లిపర గ్రామానికి చెందిన సినీ నిర్మాత వి.ఎస్‌.రామిరెడ్డి(55) మంగళవారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. రామిరెడ్డి నిర్మాతగా స్టూవర్టుపురం దొంగలు, శత్రువు, లేడీ బ్యాచిలర్స్‌ తదితర సినిమాలు తీశారు. మరియు అనే సేవా కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం రామిరెడ్డి భౌతికకాయాన్ని స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్‌ సందర్శించి, పూలమాలు వేసి నివాళులర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
చదవండి: అభిమానులే నాకు గాడ్‌ఫాదర్స్‌  

మరిన్ని వార్తలు