గోదారి తీరంలో మణిరత్నం సినిమా షూటింగ్‌!

22 Feb, 2021 12:25 IST|Sakshi

పోలవరం రూరల్ (పశ్చిమగోదావరి)‌: గోదావరి తీరంలో సినిమా షూటింగ్‌ సందడి నెలకొంది. పోలవరం మండలంలో సింగన్నపల్లి వద్ద ఓ సినిమాకు సంబంధించి షూటింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి నదిలో టూరిజం బోట్లు, పడవలు ఏర్పాటు చేసి డెకరేషన్‌ చేపట్టారు. సింగంపల్లి నుంచి గోదావరి నదిలో పాపికొండలు వెళ్లే మార్గంలో షూటింగ్‌ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ సెట్టింగులతో పలు సన్నివేశాలు ఈ ప్రాంతంలో చేసేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. మణిరత్నం దర్శకత్వంలో రూపొందే సినిమాకు ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సినీ సిబ్బంది ఆదివారం నదిలో ట్రయల్‌ రన్‌ నిర్వహించారు.
చదవండి:
బోయపాటి సినిమా​కు బ్రేక్‌.. కారణం ఇదే! 
లూసిఫర్‌: మరో ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌

మరిన్ని వార్తలు