స్టార్ హీరోయిన సమంతకు ఈ ఏడాది వ్యక్తిగతంగా అంతగా కలిసిరాకపోయిన వృత్తి పరంగా బాగా కలిసోచ్చింది. నాగచైతన్యతో విడాకులు తీసుకుని వైవాహిక జీవితానికి స్వస్తి పలికిన సామ్ కెరీర్ పరంగా దూసుకుపోతోంది. ఇక ఆమె విడాకులకు పరోక్షంగా కారణమైన ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ సమంత మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇందులో రాజీగా సమంత నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి. ఇంకా చెప్పాలంటే ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో బ్లాక్బస్టర్గా నిలిచింది.
చదవండి: Jr NTR: బైక్ సీన్ ట్రోల్స్పై స్పందించిన జా. ఎన్టీఆర్
సమంత రాజీ పాత్రలో జీవించింది. ఈ సిరిస్తో సమంత బాలీవుడ్ ప్రేక్షకులకి మరింత దగ్గరైంది. ఈ పాత్రకు గాను సమంత చాలా అవార్డులు, రివార్డులు దక్కించుకుంది. గోవా ఫిలిం ఫెస్టివల్కు వెళ్లిన ఫస్ట్ టాలీవుడ్ హీరోయిన్గా గుర్తింపు పొందింది సామ్. తాజాగా దేశంలోని ఓటీటీ ప్లాట్ ఫామ్లను ఆధారం చేసుకొని ఉత్తమ నటీనటుల జాబితాను రిలీజ్ చేశారు. ఓటీటీలో విడుదలైన వెబ్సిరీస్ల బెస్ట్ సిరీస్ను ఎంపిక చేసి ఫిలింఫేర్ ఓటీటీ అవార్డులను అందించన్నారు.
చదవండి: జెర్సీ ఓటీటీ రిలీజ్పై మేకర్స్ క్లారిటీ
ఈ క్రమంలో ఫిలింఫేర్ ఓటీటీ అవార్డ్స్ 2021 గాను ఉత్తమ నటీనటుల జాబితాలో సమంతకు నాలుగో స్థానం దక్కింది. మొదటి స్థానంలో మనోజ్ బాజ్పాయ్, రెండవ స్థానంలో మనోజ్ త్రిపాఠి(పంకజ్ త్రిపాఠి), మూడవ స్థానంలో నవాజుద్దీన్ సిద్దిఖీ నిలవగా, హీరోయిన్స్లో తొలి స్థానాన్ని సంపాదించుకుంది సమంత. ఒక రకంగా చెప్పాలంటే బాలీవుడ్ హీరోయిన్స్ దాటి ఈ జాబితాలో సమంత నాలుగవ స్థానం సంపాదించడం నిజంగా విశేషం. ఇంతటి అరుదైన ఘనత సాధించాడానికి ‘ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్లోని రాజి పాత్రే వల్ల సాధ్యమైందని చెప్పుకోవాలి.