నాన్‌స్టాప్‌ నలభైరోజులు

2 Sep, 2020 01:25 IST|Sakshi

వైష్ణవ్‌ తేజ్, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. వికారాబాద్‌ అడవుల్లో ఈ సినిమా చిత్రీకరణ జరుపుతున్నారు. నలభైరోజులు నాన్‌స్టాప్‌గా జరిగే ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ మొత్తాన్ని పూర్తి చేయాలనుకుంటున్నారు. మంగళవారం ఈ సెట్‌లో అడుగుపెట్టారు రకుల్‌. ప్రస్తుతం వైష్ణవ్, రకుల్‌పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. జాగర్లమూడి సాయిబాబు, రాజీవ్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీత దర్శకుడు.

మరిన్ని వార్తలు