నటుడు ఆర్యకు ముందస్తు బెయిల్‌ ఇవ్వొద్దు!

28 Mar, 2021 08:54 IST|Sakshi

మద్రాసు హైకోర్టులో యువతి పిటిషన్‌ 

సాక్షి, చెన్నై: తమిళ నటుడు ఆర్యకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయకూడదని శ్రీలంకకు చెందిన మహిళ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. జెమినిలో నివసిస్తున్న శ్రీలంకకు చెందిన ఓ యువతి ఆర్య తనను వివాహం చేసుకుంటానని చెప్పి రూ.70 లక్షలు తీసుకుని మోసం చేశారని ఆరోపిస్తూ పీఎం, సీఎం, హోం మినిస్టర్‌ కార్యాలయాలకు లేఖ రాశారు.

దీంతో ఆర్య అనుచరుడు మహమ్మద్‌ అర్మన్‌ ముందస్తు బెయిల్‌ కోరుతూ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే వారికి బెయిల్‌ ఇవ్వకూడదని కోరుతూ యువతి మరో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌  శుక్రవారం న్యాయమూర్తి సెల్వ కుమార్‌ సమక్షంలో విచారణకు వచ్చింది. విచారణను ఏప్రిల్‌ 4వ తేదీకి వాయిదా వేశారు.
చదవండి: షారుఖ్‌తో సినిమా.. ముంబైలో ఆఫీస్‌ వెతుకుతున్న డైరెక్టర్

మరిన్ని వార్తలు