Gopichand: ఆగస్టులో ‘ఆరడుగుల బుల్లెట్‌`

4 Jul, 2021 13:51 IST|Sakshi

Aaradugula Bullet Movie: టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్, న‌య‌న‌తార హీరో హీరోయిన్లుగా బి. గోపాల్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్‌’. జయబాలజీ రీల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిలెట్‌ పతాకంపై తాండ్ర రమేష్‌ నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఆగస్టులో ఈ మూవీని  ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా నిర్మాత తాండ్ర రమేష్ ఓన్ రిలీజ్‌ చేస్తుండటం విశేషం. ఈ చిత్రానికి వ‌క్కంతం వంశీ క‌థ‌ అందించగా, మ‌ణిశ‌ర్మ సంగీతం సమకూర్చాడు. 

మరిన్ని వార్తలు