బూసాన్‌కు గల్లీబాయ్‌

25 Jul, 2020 01:54 IST|Sakshi
రణ్‌ వీర్‌ సింగ్

ఈ ఏడాది భారతదేశం తరపున ఆస్కార్‌ అవార్డులకు నామినేట్‌ అయిన ‘గల్లీబాయ్‌’ ప్రస్తుతం సౌత్‌ కొరియాకు వెళ్లనుంది. సౌత్‌ కొరియాలో జరగనున్న బూసాన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు ‘గల్లీ బాయ్‌’ ఎంపికైంది.  ఈ చిత్రోత్సవాల్లో ‘రిక్వెస్ట్‌ సినిమా స్క్రీనింగ్‌’ విభాగంలో ఈ సినిమా ఎంపికైంది. జోయా అక్తర్‌ దర్శకత్వంలో రణ్‌ వీర్‌ సింగ్, ఆలియా భట్‌ ముఖ్య పాత్రల్లో రూపొందిన చిత్రం ఇది. ముంబై మురికి వాడల్లో నివసించే ర్యాపర్‌ కథే ఈ చిత్రం.

మరిన్ని వార్తలు