Telisinavallu Teaser: విభిన్న కథాంశంతో వస్తున్న 'తెలిసినవాళ్లు'.. ఆకట్టుకుంటున్న టీజర్  

27 Sep, 2022 19:23 IST|Sakshi

రొమాన్స్ –ఫ్యామిలీ –థ్రిల్లర్ జోనర్స్ కలిసిన కొత్త తరహా కథనంతో రూపొందుతున్న చిత్రం 'తెలిసినవాళ్లు'. ఈ సినిమాలో రామ్ కార్తీక్, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఈ చిత్రానికి విప్లవ్ కోనేటి దర్శకత్వం వహించగా.. శ్రీ చరణ్ పాకాల సంగీతమందిస్తున్నారు. సిరెంజ్ సినిమా పతాకంపై కేఎస్వీ ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం.    

(చదవండి: గాడ్ ఫాదర్ మరో సాంగ్ అవుట్.. అభిమానులకు గూస్‌బంప్స్‌ ఖాయం)

ఈ చిత్ర టీజర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఫ్యామిలీ సూసైడ్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్ర టీజర్ ఆద్యంత ఆసక్తికరంగా సాగింది. కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా సంబంధించి మరిన్ని అప్‌డేట్స్‌, రిలీజ్ తేదీని త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ , జయ ప్రకాష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

మరిన్ని వార్తలు