Hero Nithin : ' ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ఫస్ట్‌ సాంగ్‌ విడుదల చేసిన నితిన్‌

5 Oct, 2022 13:36 IST|Sakshi

అల్లరి నరేశ్, ఆనంది జంటగా తెరకెక్కుతున్న చిత్రం 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'. ఈ చిత్రానికి ఏఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దండు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అల్లరి నరేష్‌ కెరీర్‌లో 59వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఓ సాంగ్‌ను రిలీజ్‌ చేశారు. నా తెలుగు భాషలో కొత్త అక్షరం నువ్వా .. నా చేతి గీతలో కొత్తరేఖవైనావా .. లచ్చిమీ .. నీ ఎనక ఎనక వస్త కనకలచ్చిమి " అనే సాంగ్‌ను హీరో నితిన్‌ విడుదల చేశారు.

ఈ పాటను జావేద్ అలీ ఆలపించారు. నాంది మూవీ తర్వాత అల్లరి నరేశ్ నటించిన చిత్రం కావడంతో ఫ్యాన్స్‌లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు సాయి చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 11న థియేటర్లలో అభిమానులను పలకరించనుంది.

మరిన్ని వార్తలు