కొత్త చిత్రానికి హీరో సూర్య శ్రీకారం 

1 Feb, 2021 13:42 IST|Sakshi
పూజా కార్యక్రమంలో చిత్ర యూనిట్‌

నటుడు సూర్య నిర్మాతగా మారి 2డీ ఎంటర్‌టెయిన్‌మెంట్‌ పతాకంపై తాజాగా 14వ చిత్రానికి ఆదివారం పూజా కార్యక్రమాలతో శ్రీకారం చుట్టారు. చెన్నై గోకులం స్టూడియోలో ప్రారంభమైన  చిత్రానికి మద్రాసు హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి కె. వెంకటరామన్, తమిళనాడు తుపాకీ షూటింగ్‌ సంఘ కార్యదర్శి ఆర్‌. రవికృష్ణన్, చిత్ర సహనిర్మాత రాజశేఖర్‌ కర్పూర పాండియన్‌ హాజరయ్యారు. ఇందులో రమ్యా పాండియన్‌ కథానాయికగా నటిస్తున్నారు. చిత్రానికి అరిసిల్‌ మూర్తి దర్శకత్వం వహిస్తున్నారు. గాయకుడు క్రిష్‌ సంగీత దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సుకుమార్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు