Payal Rajput: శ్రీవారిని దర్శించుకున్న పాయల్‌.. సెల్ఫీల కోసం ఎగబడ్డ ఫ్యాన్స్‌

13 Mar, 2022 15:23 IST|Sakshi

Heroine Payal Rajput Visits Tirumala: ఆర్‌ఎక్స్‌ 100 హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్‌ తిరుమలలో సందడి చేసింది. ఆదివారం శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంది. సాంప్రదాయబద్దంగా లంగా ఓణీలో తిరుమలకు విచ్చేసింది. తిరుమలకు రావడం సంతోషంగా ఉందని పేర్కొంది

ఇక దర్శనం అనంతరం ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు ఫ్యాన్స్‌ ఎగబడ్డారు. కాగా ప్రస్తుతం తిరుమలలో ఓ సినిమా షూటింగ్‌ చేస్తున్నట్లు చెప్పింది. జిన్నా అనే సినిమాలో నటిస్తున్నానని, వీటితో పాటు తీస్మార్‌ఖాన్‌, గోల్‌మాల్‌, కిరాతక వంటి సినిమాల్లో నటిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

మరిన్ని వార్తలు