అక్టోబర్‌లో ఐనా ఇష్టం నువ్వు

16 Sep, 2020 04:08 IST|Sakshi

సీనియర్‌ యాక్టర్‌ నరేష్‌ తనయుడు నవీన్‌ విజయ్‌ కృష్ణ, కీర్తీ సురేష్‌ జంటగా నటించిన చిత్రం ‘ఐనా ఇష్టం నువ్వు’. దర్శకుడు కృష్ణవంశీ శిష్యుడు రాంప్రసాద్‌ రౌత్‌ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు. మూడు రోజుల చిత్రీకరణ మినహా సినిమా షూటింగ్‌ పూర్తయింది. అక్టోబర్‌ చివరి వారంలో విడుదల కానున్న ఈ సినిమా వివాదంలో పడింది. ‘‘ఈ సినిమాని చంటి అడ్డాల మాకు అమ్మినట్టు సాక్ష్యాలున్నాయి. అయినా ఎక్కువ డబ్బు కోసం ఆయన మమ్మల్ని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు’’ అని నిర్మాత నట్టికుమార్‌ ఆరోపించారు. కాగా, ఈ చిత్రానికి ‘జానకితో నేను’ అని టైటిల్‌ మార్చినట్లు, అక్టోబర్‌లో విడుదల చేయనున్నట్లు ఇటీవల నిర్మాత చంటి అడ్డాల తెలిపారు. మరి.. ఫైనల్‌గా ఈ సినిమాని ఎవరు రిలీజ్‌ చేస్తారో చూడాలి.

మరిన్ని వార్తలు