‘గిల్టీ మైండ్స్‌’ భామ దీక్షా జునేజా గురించి ఈ విషయాలు తెలుసా?

19 Jun, 2022 13:01 IST|Sakshi

అమెజాన్‌ ప్రైమ్‌ లీగల్‌ డ్రామా ‘గిల్టీ మైండ్స్‌’ .. ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది వెబ్‌స్క్రీన్‌. అందులో ముఖ్య భూమికలో మెరిసిన నటి.. దీక్షా జునేజా. ఆమె వివరాలు కొన్ని ఇక్కడ.. 

పుట్టింది పంజాబ్‌లోని రాజ్‌పురాలో. పెరిగింది చండీగఢ్‌లో. తల్లిదండ్రులు.. శశి జునేజా, అశోక్‌ జునేజా.  జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చదివింది దీక్షా. 

► చిన్నప్పటి నుంచే నటన పట్ల ఆసక్తి ఉండడంతో చాలా మంది నటీనటుల్లాగే డిగ్రీ అయిపోగానే యాక్టింగ్‌లో కెరీర్‌ వెదుక్కోవడానికి ముంబై చేరింది. 

ముందు మోడలింగ్‌లో అవకాశాలు వచ్చాయి. తర్వాత ‘దిల్‌ జో న కహ సకా (2017)’తో బాలీవుడ్‌లో పరిచయం అయితే అయింది కానీ పెద్దగా పేరు రాలేదు. అప్పుడే నెట్‌ఫ్లిక్స్‌ ‘రాజ్మాచావల్‌’లో చాన్స్‌ వచ్చింది హీరోయిన్‌గా. ఆ మూవీతో వెబ్‌ వీక్షకులందరినీ ఆకట్టుకుంది దీక్షా. 

► ఆ వెంటనే ‘గర్ల్‌ఫ్రెండ్‌ చోర్‌’ అనే వెబ్‌ సిరీస్‌లోనూ అవకాశం వచ్చింది. చేసింది. అందులోని దీక్షా నటనా దక్షతను బాలీవుడ్‌ గ్రహించింది. ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’లో చాన్స్‌ ఇచ్చి ఆమె ప్రతిభను గౌరవించింది.

అనంతరం సోనమ్‌ కపూర్, దుల్కర్‌ సల్మాన్‌ నటించిన ‘జోయా ఫ్యాక్టర్‌’లోనూ ఓ పాత్ర పోషించింది. ఆ సినిమాలో ఆ ఇద్దరితో సమంగా పాపులారిటీని సంపాదించుకుంది. తర్వాత మళ్లీ  ‘లవ్, లస్ట్‌ అండ్‌ కన్‌ఫ్యూజన్‌ 2’ అనే వెబ్‌సిరీస్‌లో మంచి రోల్‌ ఆమెను వరించింది.   

► ఇదిగో ఇప్పుడు అమెజాన్‌ హిట్‌ సిరీస్‌ ‘గిల్టీ మైండ్స్‌’..  ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ను ఫాలో అవుతున్న ప్రతి గడపను ఆమె ఫ్యాన్‌గా మార్చేసింది. ఆ అభిమానానికి స్పందిస్తూ ‘రెండేళ్ల కరోనా కాలం తర్వాత ప్రేక్షకుల ఆదరాభిమానాలను ఇంతగా ఆస్వాదిస్తున్నది ఈ సిరీస్‌తోనే. ఇది జీవితకాలం గుర్తుండిపోయే జ్ఞాపకం.. థాంక్యూ.. ’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.  

► తీరిక వేళల్లో స్విమ్మింగ్, డాన్స్, ట్రావెలింగ్‌ను ఇష్టపడుతుంది దీక్షా. 

మరిన్ని వార్తలు