Nikhil Siddhartha: కార్తికేయ-3పై ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చిన నిఖిల్‌

23 Sep, 2022 15:08 IST|Sakshi

కార్తికేయ-2 సినిమాతో సాలిడ్‌ హిట్‌ అందుకున్న హీరో నిఖిల్‌.  చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించింది. పాన్‌ ఇండియా స్థాయిలో సత్తాచాటిన ఈ సినిమా కంగా రూ.100 కోట్ల గ్రాస్ మార్కును దాటేసి.. మొత్తం 125 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. నిఖిల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిందీ చిత్రం. నార్త్‌ ఆడియెన్స్‌కు కూడా ఈ సినిమా తెగ నచ్చేసింది.

ఇక ఈ సినిమా సీక్వెల్‌ కార్తికేయ-3 కోసం అప్పుడే అందరిలోనూ ఆసక్తి మొదలయ్యింది. తాజాఆగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిఖిల్‌ కార్తికేయ-3పై ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌ ఇచ్చాడు. త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్‌ మొదలుపడతామని, అంతేకాకుండా కార్తికేయ-3ని 3Dలో రిలీజ్‌ చేయనున్నట్లు తెలిపాడు. మరి ఈ సినిమా ఇంకెన్ని సెన్సేషన్స్‌ క్రియేట్‌ చేస్తుందో  చూడాల్సి ఉంది.

మరిన్ని వార్తలు