మనందరికీ రైతు అవసరం ఉంది – సునీల్‌

23 Jan, 2021 11:09 IST|Sakshi

శ్రీకాంత్, సునీల్‌ ప్రధాన పాత్రల్లో శ్రీ కార్తికేయ, అభిరామ్, ప్రవీణ్, హరీశ్‌ గౌతమ్‌ హీరోలు గా రూపొందిన చిత్రం ‘జైసేన’. వి. సముద్ర దర్శకత్వంలో వి. విజయలక్ష్మీ, వి. సాయి అరుణ్‌కుమార్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. సునీల్‌ మాట్లాడుతూ– ‘‘ఒక రైతుకు మన అవసరం లేకున్నా మనందరికీ రైతు అవసరం ఉంది. అందుకని వారి సమస్యలను పరిగణనలోకి తీసుకోవాలి. ఈ చిత్రంలో పవర్‌ఫుల్‌ ఐపీయస్‌ పాత్రలో నటించాను. రైతు సమస్యలను పదిమందికీ చెబుతూ వారికి పరిష్కారాన్ని చూపించటం మంచి విషయం’’ అన్నారు. వి. సముద్ర మాట్లాడుతూ– ‘‘రైతులకు న్యాయం జరిగే విధంగా ఓ పరిష్కారాన్ని సినిమాలో చర్చించాం. రైతుల గురించి తీసిన సినిమా కాబట్టి రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ప్రవీణ్, అభిరామ్, రైటర్‌ చందు, కో ప్రొడ్యూసర్స్‌ శిరీషా రెడ్డి, శ్రీనివాస్‌  రెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు