దివంగత నటి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ బాలీవుడ్లో పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్లో హిందీలో ధడక్గా రీమేక్ అయి సూపర్ హిట్ కొట్టింది. ఈ చిత్రంతోనే వెండితెర అరంగ్రేటం చేసిన భామ జాన్వీ కపూర్. బాలీవుడ్లో వరుస సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు సాధించింది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటోంది భామ. ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను పలకరిస్తోంది.
(ఇది చదవండి: ఆమెను ఎందుకు ఫాలో అవుతున్నారు.. జాన్వీ కపూర్పై దారుణంగా ట్రోల్స్)
తాజాగా మంగళవారం రాత్రి ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ తన ప్రియుడు ఓర్హాన్ అవత్రమణితో చేతులు పట్టుకుని ఫోటోలకు పోజులిచ్చింది. అయితే జాన్వీ కపూర్, ఓర్రీ తమ రిలేషన్ను ఇప్పటి వరకు ఖండించలేదు. ఇద్దరూ తరచుగా బయట కలిసి తిరుగుతూ సందడి చేస్తుంటారు. కొద్ది రోజుల క్రితం ఓర్రీతో ఉన్న సంబంధం గురించి జాన్వీని ప్రశ్నించగా.. ఇద్దరం కలిసి పెరిగామని.. అతను తనకు కుటుంబంలో వ్యక్తి లాంటివాడని చెప్పుకొచ్చింది.
జాన్వీ చివరిసారిగా 'మిలి' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ఆమె రాజ్ కుమార్ రావు సరసన 'మిస్టర్ అండ్ మిసెస్ మహి' కోసం సిద్ధమవుతోంది, అలాగే ఆమె వరుణ్ ధావన్తో 'బవాల్' షూటింగ్ను కూడా ఇటీవలే పూర్తి చేసుకుంది.