Janhvi Kapoor: తెలుగులో తొలి సినిమాకే అన్ని కోట్లు పుచ్చుకుంటున్న హీరోయిన్‌!

9 Mar, 2023 14:19 IST|Sakshi

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఖరారైన విషయం తెలిసిందే. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ 30వ సినిమాతో జాన్వీ తెలుగు తెరకు పరిచయం కానుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ పల్లెటూరి అమ్మాయిగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.  ఈ మేరకు జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర నిర్మాణ సంస్థలు ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఇదివరకే విడుదల చేశాయి. ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌ సినిమాలో నటించేందుకు జాన్వీ భారీ మొత్తంలో పారితోషికం పుచ్చుకుందట. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం జాన్వీ రూ. 5 కోట్లు చార్జ్‌ చేస్తుందట.

వాస్తవానికి బాలీవుడ్‌ సినిమాల్లో నటించడానికి జాన్వీ రూ. 3 కోట్ల నుంచి రూ.3.5 కోట్ల వరకు పారితోషికంగా తీసుకునేది. కానీ తెలుగులో లాంచ్‌ అవ్వడానికి మాత్రం ఒకేసారి కోటిన్నర పెంచేసింది. తొలి సినిమాకే  ఇంత మొత్తం తీసుకుంటుండడం టాలీవుడ్, బాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. కాగా 'ప్రాజెక్టు K' మూవీ కోసం దీపికా పదుకొణె ఏకంగా రూ.10 కోట్లు తీసుకుంటోందట. ఆమె తర్వాత అత్యధిక మొత్తం చార్జ్ చేస్తున్న హీరోయిన్‌గా జాన్వీ కపూర్ నిలిచినట్లు ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

మరిన్ని వార్తలు