Attack OTT Release Date: జాన్‌ అబ్రహం, రకుల్‌ మూవీ 'యాక్షన్‌', ఎప్పటినుంచంటే?

14 May, 2022 15:43 IST|Sakshi

బాలీవుడ్‌ హీరో జాన్‌ అబ్రహం నటించిన యాక్షన్‌ మూవీ అటాక్‌ పార్ట్‌ 1. లక్ష్య రాజ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయికలు. భారీ అంచనాల మధ్య ఏప్రిల్‌ 1న రిలీజైన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తాజాగా ఈ మూవీ ఓటీటీ బాట పట్టింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ 5లో మే 27 నుంచి అటాక్‌ స్ట్రీమింగ్‌ కానుంది. సుమారు 190కి పైగా దేశాల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది. యాక్షన్‌ సినిమాలను ఇష్టపడే వారు ఎంచక్కా ఇంట్లోనే అటాక్‌ ఫస్ట్‌ పార్ట్‌ను వీక్షించేయండి.

చదవండి: ముచ్చటగా మూడోసారి.. అదే రిపీట్‌ అవుతుందా?

మరిన్ని వార్తలు