యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కు కరోనా

10 May, 2021 15:22 IST|Sakshi

కరోనా సినీ ప్రరిశ్రమలో కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్‌ హీరోల నుంచి నటీనటులు, దర్శక-నిర్మాతల వరకు కోవిడ్‌ బారిన పడుతున్నారు. తాజాగా స్టార్‌ హీరో, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. 

సోమవారం ట్వీట్‌ చేసిన ఎన్టీఆర్‌.. ‘నాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. నేను నా కుటుంబం ఐసోలేషన్‌లో ఉన్నాం. అన్ని కరోనా ప్రొటోకాల్‌ పాటిస్తూ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నాము. గత కొద్ది రోజులుగా నాతో సన్నిహితంగా ఉన్నావారంతా కోవిడ్‌ పరీక్షలు చేసుకొవాల్సిందిగా అభ్యర్థిస్తున్నా’ అంటూ రాసుకొచ్చారు. కాగా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఇటీవల మహ్మమ్మారి బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే.  

చదవండి: 
కరోనా రక్కసికి బలైన టీఎన్‌ఆర్‌ 

మరిన్ని వార్తలు