టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇప్పుడు ఎక్కువ సమయం కొడుకుతో గడపడానికే కేటాయిస్తుంది. గతేడాది జూన్లో ఈ ‘చందమామ’కి పండంటి మగ బిడ్డ జన్మించిన విషయం తెలిసిందే. అతనికి నీల్ కిచ్లూ అని నామకరణం చేసింది. ఈ విషయంతో పాటు కొడుకుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. తల్లిగా తను పొందే ఆనందాన్ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది ఈ బ్యూటీ.
అయితే ఇప్పటి వరకు కుమారుడిని మొత్తంగా చూపించలేదు. సైడ్గా చూపిస్తూ.. అతను చేసే అల్లరి పనులను చెప్పుకొచ్చింది. కానీ తాజాగా కొడుకు ఫుల్ పోటోని అభిమానులతో షేర్ చేసుకుంది. కొడుకు పుట్టి 9 నెలలు పూర్తయిన సందర్భంగా గురువారం(జనవరి 19) కాజల్ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. దేవుడు నీ ద్వారా చేయించబోయే పనులను చూడడానికి వేచి ఉండలేకపోతున్నాను. గడిచిన 9 నెలలతో పాటు రాబోయే రోజులకు ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను. . ఏడాదిలో మూడవవంతు పూర్తి చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది’ అంటూ నీల్ కిచ్లూ నవ్వుతూ ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కాజల్ అగర్వాల్ 2020లొ ముంబైకి చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది జూన్ 19న ఈ జంటకు కొడుకు పుట్టాడు. ప్రెగ్నెన్సీ కారణంగా దాదాపు ఏడాదిన్నర పాటు సినిమాలకు దూరమైంది కాజల్. ప్రస్తుతం ఈ బ్యూటీ కమల్ హాసన్, శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ఇండియన్-2 చిత్రంలో నటిస్తోంది.