Kamal haasan- Simbu: శింబు కోసం కమల్‌ హాసన్‌

31 Aug, 2022 09:06 IST|Sakshi

మానాడు సక్సెస్‌ తర్వాత శింబు కథానాయకుడిగా నటించిన చిత్రం వెందు తనిందదు కాడు. ఈ చిత్రానికి కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించారు. విన్నై తాండి వరువాయా, అచ్చం యన్బదు మడమయడ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత శింబు, గౌతమ్‌ మీనన్‌ల కాంబోలో వస్తున్న చిత్రం ఇది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిత్రంలోని కాలత్తుకు నీ వేనుం అనే పాట, ఏఆర్‌ రెహ్మాన్‌ పాడిన మరక్కుమా నెంజమ్‌ అనే పాట ఇప్పటికే విడుదలై సంగీత ప్రియులను అలరిస్తున్నాయి.

ఐసరి గణేష్‌ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 15వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది. కాగా చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని సెప్టెంబర్‌ రెండవ తేదీ చెన్నైలో భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కార్యక్రమంలో ఏఆర్‌ రెహమాన్‌ సంగీత కచేరి నిర్వహించబోతున్నట్లు వర్గాలు తెలిపారు. కాగా, ఈ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనాలని నిర్మాత ఐసరి గణేష్‌ మంగళవారం కమలహాసన్‌ను స్వయంగా కలిసి ఆహ్వానించారు. 

చదవండి: (కోబ్రాపై భారీ అంచనాలు.. కాలేజీ యాజమాన్యానికి సెలవు కోసం విద్యార్థుల లేఖ)

మరిన్ని వార్తలు