Vikram Movie: దుమ్ములేపుతున్న 'విక్రమ్‌'.. ఆ ఒక్క రాష్ట్రం నుంచే రూ. 150 కోట్లు

19 Jun, 2022 18:13 IST|Sakshi

సుమారు నాలుగేళ్ల తర్వాత బాక్సాఫీస్ వద్ద సందడి చేశాడు ఉలగ నాయగన్‌ (లోక నాయకుడు) కమల్‌ హాసన్‌. ఆయన తాజాగా నటించి సూపర్‌ బ్లాక్‌బ్లస్టర్‌ హిట్‌గా నిలిచిన చిత్రం 'విక్రమ్‌'. కమల్‌తోపాటు విజయ్‌సేతుపతి, ఫాహద్‌ ఫాజిల్‌, సూర్య విభిన్న పాత్రల్లో అలరించిన ఈ సినిమాకు లోకేష్‌ కనకరాజు దర్శకత్వం వహించారు. నాలుగేళ్ల తర్వాత ఈ సినిమాతో పవర్‌ఫుల్‌ కమ్‌బ్యాక్‌ ఇచ్చాడు కమల్‌ హాసన్. అయితే ఈ మూవీ విడుదలైన 16 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల వసూళ్లు సాధించింది.

ఈ మొత్తం బాక్సాఫీస్‌ కలెక్షన్లలో సగం అంటే రూ. 150 కోట్లు ఒక్క తమిళనాడు రాష్ట్రం నుంచే వచ్చాయట. దీంతో ఇప్పటివరకు ఆ రాష్ట్రంలో ఉన్న బాహుబలి 2 సినిమా కలెక్షన్ల రికార్డును విక్రమ్‌ బద్దలు కొట్టినట్లయింది. వచ్చే రోజుల్లో విక్రమ్‌ మరిన్ని రికార్డులు క్రియేట్‌ చేస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా ఇటీవల ఈ సినిమా సక్సెస్‌ సాధించిన సంతోషంలో చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్‌ చేసిన వారికి, థియేటర్‌ యజమానులకు స్పెషల్ పార్టీ ఇచ్చింది మూవీ యూనిట్. మూవీని సక్సెస్‌ చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపింది. 

చదవండి: 'విక్రమ్‌' సక్సెస్‌ డిన్నర్‌ పార్టీ.. విందులోని వంటకాలు ఇవే..
చెత్త ఏరిన స్టార్‌ హీరోయిన్‌.. వీడియో వైరల్‌
కామంతో కళ్లు మూసుకుపోతే..

>
మరిన్ని వార్తలు