జనవరికి డెడ్‌లైన్‌

12 Sep, 2020 03:14 IST|Sakshi

కమల్‌హాసన్‌ ప్రస్తుతం రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. ఓ వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉంటున్నారు. అయితే ప్రస్తుతం చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసి, ఆ తర్వాత పూర్తిగా రాజకీయాల మీద దృష్టి పెడతానని ఆ మధ్య ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం శంకర్‌ దర్శకత్వంలో ‘ఇండియన్‌ 2’ చేస్తున్నారు కమల్‌హాసన్‌. కరోనా వల్ల చిత్రీకరణ వాయిదా పడింది. అయితే సినిమాలో తన భాగాన్ని జనవరి నెలలోగా పూర్తి చేయాలని శంకర్‌ను కోరారట కమల్‌. తమిళనాడు రాష్ట్ర ఎన్నికలు ఏప్రిల్‌ లేదా మేలో జరగనున్నాయి. అందుకు సిద్ధమవ్వడం కోసమే ఈ నిర్ణయం అని ఊహించవచ్చు.

>
మరిన్ని వార్తలు