మైసూరు : కన్నడ దర్శకుడు భర్జరి చేతన్ మైసూరులో ఆదివారం నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. కరోనా నిబంధనలు నేపథ్యంలో అతి తక్కువ మంది సమక్షంలో ఆయన మానస అనే యువతిని పెళ్లి చేసుకున్నారు. నటుడు పునీత్ రాజ్కుమార్, ధృవసర్జా, నిర్మాత ఉపాపతి తదితరులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ నటిస్తున్న జేమ్స్ సినిమాకు చేతన్ దర్శకత్వం వహిస్తున్నారు.