Rishab Shetty: ఇది అసలు ఊహించలేదు..  కాంతార హీరో రిషబ్ శెట్టి

29 Oct, 2022 18:58 IST|Sakshi

ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ , రిషబ్‌ శెట్టి కాంబినేషన్‌లో వచ్చిన కన్నడ చిత్రం ‘కాంతార’. బాక్సాఫీస్‌ వద్ద దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. సెప్టెంబర్ 30న కన్నడలో రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాను తెలుగులో అక్టోబర్ 15న విడుదల చేశారు. టాలీవుడ్‌లో మెగా నిర్మాత అల్లు అరవింద్ గీతా ఫిల్మ్స్ ద్వారా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సక్సెస్ టూర్ ప్రారంభించింది. నేడు తిరుపతి, విశాఖపట్నంలో ఉన్న థియేటర్లను కాంతారా చిత్రబృందం సందర్శించింది. ఈ సందర్భంగా సినిమా విశేషాలను దర్శకుడు, హీరో రిషబ్‌ శెట్టి  అభిమానులతో పంచుకున్నారు. 

(చదవండి: ‘కాంతార’కి బిగ్ షాకిచ్చిన కోర్టు.. ఇకపై దాన్ని ప్రదర్శించకూడదు!)

హీరో రిషబ్‌ శెట్టి మాట్లాడుతూ... 'ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఇంతగా ఆదరిస్తారని ఊహించలేదు. కేవలం రెండు వారాల్లో ఈ సినిమా రూ.50 కోట్ల వసూళ్లు సాధించడం ఆనందంగా ఉంది. ఇంతలా ఆదరించినందుకు టాలీవుడ్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీ ఆదరాభిమానాలు ఎప్పటికి ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.' అని అన్నారు. 

మెగా నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ...' సినిమాకు భాష ముఖ్యం కాదు.. కేవలం ఎమోషన్ ఒకటే ఉంటుంది అని కాంతార నిరూపించింది. ఈ సినిమాను కన్నడలో చూసి బన్ని వాసు నాతో చెప్పాడు. ఆ తర్వాత సినిమా చూసినప్పుడు నాకు ఎమోషన్ అర్ధమైంది. ఈ ఎమోషన్‌కు కనెక్ట్ అయి తెలుగులో డిస్ట్రిబ్యూషన్ చేస్తే బాగుంటుందనిపించింది. అందుకే టాలీవుడ్‌లోనూ రిలీజ్ చేశాం'. అని చెప్పారు. 


 

మరిన్ని వార్తలు