Kapata Nataka Sutradhari: ఓటీటీలోకి వచ్చేస్తున్న కపట నాటక సూత్రధారి, స్ట్రీమింగ్‌ అప్పుడే!

20 Oct, 2022 20:22 IST|Sakshi

వెరైటీ కాన్సెప్ట్‌తో సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన చిత్రం కపటనాటక సూత్రధారి. విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్, మాస్టర్ బాబా ఆహిల్, అమీక్ష, సునీత, భానుచందర్, రవిప్రకాశ్, అరవింద్,మేక రామకృష్ణ, విజయ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. క్రాంతి సైన దర్శకత్వం వహించిన ఈ చిత్రం గతేడాది నవంబర్‌ 12న థియేటర్లలో విడుదలైంది.

తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి రాబోతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహాలో ఈ నెల 21 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని ఆహా అధికారికంగా ప్రకటించడమే కాకుండా ట్రైలర్‌ సైతం రిలీజ్‌ చేసింది. ఇక ఈ సినిమాకు రామ్‌ తవ్వ సంగీతం అందించగా వికాస్‌ బడిస నేపథ్య సంగీతం అందించారు. ఛోటా కె ప్రసాద్‌ ఎడిటింగ్‌ చేశాడు. ఇదిలా ఉంటే దీపావళి సందర్భంగా స్వాతిముత్యం సినిమాను అక్టోబర్‌ 28 నుంచి కాకుండా 24వ తేదీ నుంచే ప్రసారం చేయనున్నట్లు వెల్లడించింది ఆహా టీమ్‌.

చదవండి: టాలీవుడ్‌కు పట్టిన కర్మ ఇది, వాళ్లు హీరోయిన్సా?
రాజీవ్‌ కంటే యాంకర్‌ సుమ సంపాదనే ఎక్కువా?

మరిన్ని వార్తలు