కరోనాతో ప్రముఖ దర్శకుడు మృతి

22 Apr, 2021 09:58 IST|Sakshi

యశవంతపుర: శాండల్‌వుడ్‌కు చెందిన ప్రముఖ పోస్టర్‌ డిజైనర్, దర్శకుడు మస్తాన్‌ (63) మంగళవారం రాత్రి కరోనాతో మృతి చెందారు. ఇటీవల కరోనా పాజిటివ్‌గా వచ్చింది. హెసరఘట్టలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 40 ఏళ్ల నుండి శాండల్‌వుడ్‌లో రెండు వేలు సినిమాలకు పోస్టర్‌ డిజైనర్‌గా సేవలందించారు. శుక్లాంబరధరం, కల్లేశీ మల్లేశీ, సితార సినిమాలకు దర్శకత్వం వహించారు. మరోవైపు నటీ అనుప్రభాకర్‌కు సైతం కరోనా పాజిటివ్‌గా వచ్చినట్లు ఆమె ఇన్‌స్ట్రాగామ్‌లో తెలిపారు. భర్త రఘు ముఖర్జీకి నెగిటివ్‌ వచ్చినట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు