టెలివిజన్ ప్రీమియర్‌లో కార్తికేయ 2 ప్రభంజనం

1 Dec, 2022 19:27 IST|Sakshi

బాక్సాఫీస్‌ వద్ద కార్తికేయ 2 సినిమా ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిందే! అటు థియేటర్లు, ఇటు ఓటీటీలో రికార్డులు సృష్టించిన ఈ మూవీ ఇటీవల బుల్లితెరలోనూ ప్రసారమైంది. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొదటిసారిగా జీ తెలుగులో ప్రసారం కాగా 7.88 రేటింగ్‌ అందుకుంది. దీంతో బుల్లితెర ప్రేక్షకుల్లో 'కార్తికేయ 2'కి ఉన్న క్రేజ్ ఏపాటిదో రుజువైంది.

2014లో వచ్చిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన సూపర్‌నేచురల్ మిస్టరీ థ్రిల్లర్  ‘కార్తికేయ 2’. ఇందులో నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్, శ్రీనివాస్ రెడ్డి, హర్ష అద్భుత నటనతో ఆకట్టుకున్నారు. టీజీ విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించారు.

చదవండి: హీరోయిన్‌ ముఖం నిండా సూదులు, ఏమైంది?
ఓటీటీలో ల్యాండయిన జిన్నా మూవీ

మరిన్ని వార్తలు