Karthikeya 2 Movie: అప్పుడు బాక్సాఫీస్‌, ఇప్పుడు ఓటీటీ.. దుమ్ము రేపుతున్న నిఖిల్‌ మూవీ

7 Oct, 2022 19:01 IST|Sakshi

టాలీవుడ్‌లో రిలీజైన చిన్న చిత్రం కార్తికేయ 2 ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో మనందరికీ తెలిసిందే! నిఖిల్‌, అనుపమ పరమేశ్వరన్‌ జంటగా నటించిన ఈ సినిమా తెలుగులోనే కాదు హిందీలోనూ అత్యధిక వసూళ్లు సాధించి సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచింది.  చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 13న విడుదలై కొన్ని వారాలపాటు థియేటర్లలో జైత్రయాత్ర నడిపింది.

అక్కడ కాసుల వర్షం కురిపించిన ఈ మూవీ దసరా కానుకగా అక్టోబర్‌ 5న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5లోకి అందుబాటులోకి వచ్చింది. అప్పటిదాకా బాక్సాఫీస్‌ రికార్డులు బద్దలు కొట్టిన కార్తికేయ 2 ప్రస్తుతం ఓటీటీలోనూ రికార్డులు తిరగరాస్తోంది. కేవలం 48 గంటల్లోనే 100 కోట్లకు పైగా స్ట్రీమింగ్‌ మినిట్స్‌తో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఓటీటీలో దుమ్మురేపుతున్న కార్తికేయ 2 విజృంభణను జీ5 అధికారికంగా ట్విటర్‌లో వెల్లడించింది.

చదవండి: ఆ హీరోతో కలిసి పని చేస్తే ఇక అంతే సంగతులట!
ఓటీటీలో అల్లూరి, స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

మరిన్ని వార్తలు