ఎన్‌.ఐ.ఏ. ఆఫీసర్‌గా కార్తికేయ

4 Apr, 2021 10:14 IST|Sakshi

‘ఆర్‌ఎక్స్‌ 100’ ఫేమ్‌ కార్తికేయ గుమ్మకొండ హీరోగా శ్రీ సరిపల్లి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. తాన్యా రవిచంద్రన్‌ కథానాయిక. సుధాకర్‌ కోమాకుల ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. టి. ఆదిరెడ్డి సమర్పణలో ‘88’ రామారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా శ్రీ సరిపల్లి మాట్లాడుతూ– ‘‘కంప్లీట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. ఇందులో కార్తికేయ ఎన్‌.ఐ.ఏ. ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఆయన పాత్ర ఫుల్‌ ఎనర్జీతో ఉంటుంది. ఈ సినిమాలో నాలుగు పాటలు ఉంటాయి.

‘మెంటల్‌ మదిలో’, ‘దొరసాని’, ’అంతరిక్షం’ చిత్రాలకు స్వరాలందించిన ప్రశాంత్‌ ఆర్‌. విహారి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు’’ అన్నారు. రామారెడ్డి మాట్లాడుతూ – ‘‘వీవీ వినాయక్‌ శిష్యుడైన శ్రీ సరిపల్లిని మా చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం చేస్తున్నాం. చాలా మంచి కథ ఇది. కార్తికేయ పాత్ర చాలా బాగుంటుంది. ఈ నెలాఖరు వరకు హైదరాబాద్‌లో జరిపే షెడ్యూల్‌తో 90 శాతం సినిమా పూర్తవుతుంది. మిగిలిన 10 శాతాన్ని మారేడుమిల్లిలో చిత్రీకరిస్తాం’’ అన్నారు.
చదవండి:
ఆ ఆలోచనను విరమించుకున్న ‘సర్కారు వారి పాట’ టీమ్‌
కపిల్‌ శర్మ గురించి ఈ నిజాలు తెలుసా?

మరిన్ని వార్తలు