కరోనా నెగెటివ్‌: పాజిటివ్‌ న్యూస్‌ చెప్పిన యంగ్‌ హీరో

6 Apr, 2021 17:22 IST|Sakshi

కరోనా సెకండ్‌ వేవ్‌ బాలీవుడ్‌ను చిగురుటాకులా వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు బీటౌన్‌ సెలబ్రిటీలు కరోనా బారిన పడిగా మరికొందరు ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుని బయటపడుతున్నారు. ఈ క్రమంలో మార్చి 22న యంగ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌కు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. 14 రోజుల క్వారంటైన్‌ ​తర్వాత అతడికి మళ్లీ పరీక్ష చేయగా నెగెటివ్‌ అని తేలింది. దీంతో తిరిగి సెట్స్‌లో అడుగు పెట్టనున్నాడీ కుర్ర హీరో.

అయితే తనకు కరోనా పీడ విరగడైందని తెలిసిన తర్వాత ఈ హీరో ఏం చేశాడనుకుంటున్నారు? అదే సాయంత్రం ఓ కొత్త కారును తన ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. అత్యంత ఖరీదైన లంబోర్గిని కారును కొనుగోలు చేసిన కార్తీక్‌ ముంబై వీధుల్లో సోమవారం దాన్ని నడుపుకుంటూ ఇంటికి తీసుకెళ్లాడు. దీని ధర ఇంచుమించు నాలుగున్నర కోట్ల రూపాయలుగా ఉందట. ఇక ఈ మధ్యే ప్రభాస్‌ ఏడు కోట్ల రూపాయలు విలువ చేసే లంబోర్గిని అవెంటాడర్‌ ఎస్‌ రోడ్‌స్టర్ కారును సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

A post shared by KARTIK AARYAN (@kartikaaryan)

ఇదిలా వుంటే కార్తీక్‌ ప్రస్తుతం 'భూల్‌ భులైయా 2' సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో కియారా అద్వాణీ, టబు, రాజ్‌పాల్‌ యాదవ్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో పాటు 'ధమాకా', 'దోస్తానా 2' చిత్రాలు చేస్తున్నాడు. 

A post shared by Viral Bhayani (@viralbhayani)

A post shared by KARTIK AARYAN (@kartikaaryan)

చదవండి: హీరో కార్తీక్‌కు కరోనా..టెన్షన్‌లో కియారా అద్వానీ

అభిమాని ఫోన్‌ లాక్కున్న అజిత్‌

లంబోర్గిని కారులో ప్రభాస్‌ షికారు

మరిన్ని వార్తలు