మరోసారి కేబీసీకి ‘సూపర్‌ 30’ ఆనంద్‌

5 Dec, 2020 19:03 IST|Sakshi

ముంబై : సూపర్‌ 30 వ్యవస్థాపకుడు, ‍‍ప్రముఖ మ్యాథ‌మెటీషియ‌న్ ఆనంద్‌ కుమార్..‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కౌన్‌ బనేగా కరోడ్‌‌పతి’ షోలో మరోసారి పాల్గొననున్నారు. త్వరలో జరగనున్న ఎపిసోడ్‌ 51, 61,62లలో పాల్గొనవల్సిందిగా కేబీసీ ఆనంద్‌ను ఆహ్వానించనుంది. ఈ మేరకు సూపర్‌ 30 శనివారం ఓ ప్రకటనను విడుదల చేసింది. 2017లో మొదటిసారి ఆయన కేబీసీలో పాల్గొన్నారు. గేమ్‌ ఆడి 25 లక్షల రూపాయలను గెలుచుకున్నారు. అంతేకాకుండా ‘అరక్షణ్‌’ సినిమాలో పాత్రకు సంబంధించి అమితాబ్‌ బచ్చన్‌కు ఆనంద్‌ కొన్ని సలహాలను కూడా ఇచ్చారు.

చదవండి : ‌అక్షయ్‌ బాటలో మిలింద్‌.. తొలిసారి ఆ పాత్రలో!

మరిన్ని వార్తలు