Keerthi Suresh: ‘దసరా’ టీంకు కీర్తి ఖరీదైన కానుకలు! ఏకంగా 130 మందికి...

20 Mar, 2023 14:07 IST|Sakshi

‘మహానటి’ మూవీతో ఉత్తమ నటిగా నేషనల్‌ అవార్డు అందుకుంది కీర్తి సురేశ్‌. ఈ సినిమాలో అచ్చం సావిత్రిని అభినయస్తూ మంచి మార్కులు కొట్టేసింది. దీంతో కీర్తి ఓవర్‌ నైట్‌ స్టార్‌ అయిపోయింది. అయితే అదే క్రేజ్‌ను ఆమె కొనసాగించలేకపోయింది. కథలను ఎంపికలతో తడపబడుతూ స్టార్‌ ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేసుకుంది. మహానటి తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించనప్పటికీ ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు.

చదవండి: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ‘మాతృదేవోభవ’ హీరోయిన్‌.. ఫొటోలు వైరల్‌

ఇటీవల మహేశ్‌ బాబు సర్కారు వారి పాటతో మంచి హిట్టు కొట్టిన కీర్తి దసరా మూవీతో ఎలాగైన మరో హిట్‌ కోట్టాలని ఆసక్తిగా ఎదురు చూస్తుంది. నానికి జోడిగా ఆమె నటించిన దసరా మూవీ ఈ నెల 30న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కీర్తికి సంబంధించిన ఓ ఆసక్తికర న్యూస్‌ నెట్టింట చక్కర్లు కొడుతోంది. సినిమా షూటింగ్‌ అయిపోయిన సందర్భంగా కీర్తి దసరా టీంకు ఖరీదైన బహుమతులు ఇచ్చిందట.

చదవండి: షాకింగ్‌: లాకర్‌లోని రజనీకాంత్‌ కూతురు ఐశ్వర్య బంగారం, వజ్రాలు చోరీ

ఈ మూవీకి పని చేసిన టెక్నీషియన్లకు బంగారు నాణెలు కానుక ఇచ్చినట్లు సమాచారం. దాదాపు 130 మంది టెక్నిషియన్లు ఒక్కొక్కరి కీర్తి గోల్డ్‌ కాయిన్స్‌ పచ్చినట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుంతో తెలియాల్సి ఉంది. కానీ కీర్తి గొప్ప మనసు ఆమె ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు.  మహానటి తర్వాత మళ్లీ నటనకు స్కోప్‌ ఉన్న అలాంటి పాత్ర రావడం, షూటింగ్‌లో తనకు అన్ని విధాలా సహకరించినందుకు గానూకృతజ్ఞతగా ఈ బంగారు నాణెలు ఇచ్చినట్లు తెలుస్తోంది.  

మరిన్ని వార్తలు