Keerhi Suresh: కూకట్‌ పల్లిలో ‘మహానటి’ కీర్తి సురేశ్‌ సందడి

12 Feb, 2022 18:05 IST|Sakshi

టాలీవుడ్‌ హీరోయిన్‌, ‘మహానటి’ కీర్తి సురేశ్‌ కూకట్‌పల్లిలో సందడి చేసింది. కూకట్‌పల్లిలో శనివారం జరిగిన ముగ్ధ ఫ్యాషన్‌ డిజైనర్‌ స్టోర్‌ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా వచ్చింది. ఈ సందర్భంగా ఆమెను ముగ్ధ కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించింది.  

టాలీవుడ్‌ సెలబ్రిటీ డిజైనర్‌గా, లాక్మె వంటి ప్రఖ్యాత ఫ్యాషన్‌ ఈవెంట్స్‌లో పాల్గొన్న ప్రముఖ డిజైనర్‌ శశి వంగపల్లి తన ముగ్ధ స్టోర్‌ను  కూకట్‌పల్లిలో ప్రారంభించారు. ఇప్పటికే  నగరంలోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో ముగ్ధ డిజైనర్‌ స్టూడియోని ఏర్పాటు చేసి ఫ్యాషన్‌ ప్రియుల ఆదరాభిమానాలను పొందిన శశి వంగపల్లి... హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి వాసుల కోసం తన ముగ్ధ స్టోర్‌ను అందుబాటులోకి తెస్తున్నారు.

మరిన్ని వార్తలు