అలిమేలు దొరికిందా?

13 Oct, 2020 00:21 IST|Sakshi

దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘జయం, నిజం’ చిత్రాల్లో గోపీచంద్‌ విలన్‌గా నటించారు. తాజాగా గోపీచంద్‌ హీరోగా తేజ దర్శకత్వంలో ఓ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘అలిమేలు మంగ వేంకటరమణ’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ఇందులో గోపీచంద్‌ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. అయితే ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారు అని కొంతకాలంగా చర్చలు నడుస్తున్నాయి. చాలామంది హీరోయిన్ల పేరు వినపడ్డాయి కూడా. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తీ సురేశ్‌ నటిస్తారని తెలిసింది. ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో సెట్స్‌ మీదకు తీసుకెళ్లాలని చిత్రబృందం భావిస్తోంది.

మరిన్ని వార్తలు