Keerthy Suresh: 'నేను ఏమైనా తప్పు చేశానా అని సరదాగా అడిగారు'

3 May, 2022 14:24 IST|Sakshi

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు, కీర్తి సురేష్‌ జంటగా నటించిన చిత్రం​ 'సర్కారు వారి పాట'. పరశురాం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇప్పటికే భారీ అంచనాలు క్రియేట్‌ చేస్తోన్న ఈ సినిమా మే12న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌ జోరు పెంచింది చిత్ర బృందం.

ఈ క్రమంలో వరుస ఇంటర్వ్యూలతో మూవీటీం బిజీ అయ్యింది. తాజాగా కీర్తి సురేష్‌ ఈ సినిమాకు సంబంధించి పలు ఇంట్రెస్టింగ్‌ విషయాలను షేర్‌ చేసుకుంది. హాఫ్‌ స్క్రీన్‌లో మహేశ్‌ బాబు కామెడీ టైమింగ్‌ ఎలా ఉంటుందని అడగ్గా.. ఆయనతో షూటింగ్‌ చాలా సరదాగా ఉంటుందని కీర్తి సురేష్‌ పేర్కొంది. ఓ సాంగ్‌ షూటింగ్‌ చేస్తున్నప్పుడు నా టైమింగ్‌ మిస్సయ్యి స్టెప్పులు మర్చిపోయాను. 

ఆ సమయంలో పొరపాటున నా చేయి మహేశ్‌ సార్‌ ముఖానికి రెండుసార్లు తగిలింది. అప్పటికే సారీ చెప్పగా, మూడోసారి కూడా అదే రిపీట్‌ కావడంతో  ‘నేను ఏమైనా తప్పు చేశానా నీకు?’అంటూ మహేశ్‌ సరదాగా అడిగారని చెప్పుకొచ్చింది. 


 

మరిన్ని వార్తలు