Keerthy Suresh: నిజామాబాద్‌కు మహానటి.. ఎగబడ్డ జనం

1 Oct, 2021 13:11 IST|Sakshi

Keerthy Suresh: నిజామాబాద్‌లో హీరోయిన్‌ కీర్తి సురేష్‌ సందడి చేసింది. నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌కి కీర్తి సురేష్‌ విచ్చేసింది. ఈ సందర్భంగా కీర్తిని చూసేందుకు భారీగా జనం తరలివచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కీర్తి సురేష్‌తో సెల్ఫీలు దిగడానికి జనం ఎగబడ్డారు. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కీర్తి చిరంజీవితో కలిసి 'భోళా శంకర్‌' అనే సినిమాలో నటిస్తుంది. ఇందులో ఆమె చిరుకు చెల్లెలుగా కనిపించనుంది. చదవండి: అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అల్లు బ్రదర్స్

మరిన్ని వార్తలు